
హైదరాబాద్ నగరంలో కొన్ని రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను నడపేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీజీఎస్ ఆర్టీసీ. టీజీఎస్ ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని 127k రూట్ లో ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ లక్జరీ బస్సులను నడుపనున్నారు. కోటి నుంచి కొండాపూర్ వరకు ఈ ఏసీ బస్సులు నడుస్తాయి.
కోఠి బస్ స్టేషన్ నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.30 వరకు కొండాపూర్ కు ఈ బస్సులు తిరుగుతాయి. కొండాపూర్ నుంచి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10.30 వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ రూట్లో ఐటీ, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులతో సదుపాయంగా ఉంటుంది.